భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!

by Disha Web Desk 17 |
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో పతనాన్ని కొనసాగిస్తూ సూచీలు శుక్రవారం ఉదయం నుంచే బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలత కొనసాగడానికి తోడు కీలక బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో కీలక కంపెనీలు నీరసించడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న గందరగోళ పరిణామాలు మన బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడిని పెంచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 671.15 పాయింట్లు నష్టపోయి 59,135 వద్ద, నిఫ్టీ 176.70 పాయింట్లు కోల్పోయి 17,412 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్పంగా పుంజుకుంది. పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.05 వద్ద ఉంది.

Also Read..

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!



Next Story